అప్పుల కుప్పలా మార్చారు: కేసీఆర్ సర్కార్ పై భట్టి విమర్శలు

బీఆర్ఎస్ అనుసరించిన అస్తవ్యస్త విధానాలతో దశాబ్దకాలంలో తెలంగాణ పురోగతి సాధించలేదని భట్టి విక్రమార్క విమర్శించారు. అన్ని రంగాల్లో కేసీఆర్ సర్కార్ విఫలమైందన్నారు. పదేళ్లలో అప్పు పదిరెట్లు పెరిగిందని ఆయన చెప్పారు. ఒంటెత్తు పోకడలతో సొంత జాగీరులా గత పాలన సాగిందన్నారు. దీంతో రాష్ట్ర పరిస్థితి అప్పుల కుప్పలా మారిందన్నారు. నాణ్యత లేని పనులతో సాగునీటి ప్రాజెక్టులు ఫలితాలు ఇవ్వలేదని పరోక్షంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని భట్టి ప్రస్తావించారు. రైతుల సాగునీటి సమస్యలు పరిష్కరించలేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories