విజయవాడ: కేంద్ర ప్రభుత్వం దివాలాకోరు విధానాలకు... ... Live Updates:ఈరోజు (జూలై-03) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

విజయవాడ: కేంద్ర ప్రభుత్వం దివాలాకోరు విధానాలకు వ్యతిరేకంగా నేడు జరుగుతున్న కార్మిక సంఘాల నిరసనలకు సిపిఐ మద్దతు - సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కరోనా మహమ్మారిని అడ్డంపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమైంది.

- దేశవ్యాప్తంగా 151 పాసింజర్ రైళ్ల నిర్వహణను ప్రైవేటు పరం చేయనున్నది.

- అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇస్రోలో కూడా ప్రైవేటు భాగస్వామ్యానికి దారులు తీసింది.

- రక్షణ రంగంలో 75 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించింది.

- ఎయిర్ ఇండియాను అమ్మేందుకు చూస్తున్నది.

- పేదలు, వలస కార్మికులు, రోజువారీ కూలీలు, నిర్మాణ కార్మికుల కష్టాలు ప్రభుత్వాలకు ఏమాత్రం పట్టలేదు.

- రు.20 లక్షల కోట్ల ఆత్మను నిర్భర్ ప్యాకేజీ వల్ల పేదలకు నయాపైసా ఉపయోగం లేదు.

- ప్రజాస్వామ్య వ్యవస్థకు సంకెళ్లేసి దుర్మార్గంగా ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తున్న కేంద్రం తీరును ఖండిస్తున్నాం. - రామకృష్ణ.

Show Full Article
Print Article
Next Story
More Stories