Gold rate: బాబోయ్ బంగారం ఎక్కడా తగ్గడం లేదు! వెండి ధరలు శాంతించడం లేదు!!

Gold rate: బాబోయ్ బంగారం ఎక్కడా తగ్గడం లేదు! వెండి ధరలు శాంతించడం లేదు!!
x
Highlights

Gold Rate: బంగారం, వెండి ధరలు ఈవారం మొత్తం పై పైకి కదిలాయి. బంగారం ధరలు రికార్డు బ్రేక్ చేస్తే.. వెండి ధరలు కూడా ఎక్కడా పసిడికి తీసిపోకుండా పరుగులు తీశాయి.

బంగారం భారతీయులకు ఎంతో ఇష్టమైన లోహం. బంగారు ఆభరణాలు ధరించడం.. బంగారంతో చేసిన వస్తువులను వాడటం అంటే అమితమైన ఆసక్తి మనకు. పెళ్లిళ్లలో బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత చెప్పలేనిది. వధువుకు ఎంత బంగారం పుట్టింటి వారిస్తారు.. ఎంత బంగారం అత్తింటి వారు పెడతారు వంటి లెక్కలు అన్ని పెళ్ళిళ్ళలోనూ ప్రధాన చర్చనీయాంశాలలో ఒకటిగా ఉంటుంది. ఇక బంగారం ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి మంచి మార్గంగా ఎక్కువ శాతం భావిస్తున్నారు. అటువంటి పసిడికి సంబంధించి ధరలు ఎలా ఉంటున్నాయనేది తెలుసుకోవాలనే ఆసక్తీ చాలా మందిలో ఉంటుంది.

ఇక బంగారం ధరలు, వెండి ధరలు రోజు రోజూ మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా ధరల్లో మార్పులు నిత్యం జరుగుతుంటాయి. సోమవారం నుంచి శనివారం వరకూ బంగారం మార్కెట్ ధరలు అటూ ఇటూ మారుతూ వస్తాయి. ఆదివారం ట్రేడింగ్ ఉండదు. కొద్దిపాటి మార్పులతో శనివారం సాయంత్రం ఉన్న ముగింపు ధరకే బంగారం అమ్మకాలు జరుగుతాయి.

ఇక గత సోమవారం(జూలై 27) నుంచి శనివారం(ఆగస్టు 01) వరకూ బంగారం ధరల్లో చోటు చేసుకున్న మార్పులు.. చేర్పులపై విశ్లేషణ.

పసిడి పరుగులు!

సోమవారం (27 జూలై) పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 49,050 రూపాయలుగానూ, 24 క్యారెట్ల బంగారం 53,480 రూపాయలుగానూ మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. ఆ రోజు ఏకంగా 730 రూపాయల పెరుగుదల కనబర్చింది. ఇక అక్కడి నుంచి వారం మొత్తం బంగారం ధరలు పైపైకి కదులుతూనే వచ్చాయి. వారాంతానికి రికార్డు గరిష్ట ధరలను నమోదు చేశాయి. శనివారం (1 ఆగస్టు) సాయంత్రం 22 క్యారెట్ల బంగారం 51,780 రూపాయలుగానూ, 24 క్యారెట్ల బంగారం 56,490 రూపాయలుగానూ ముగిసాయి. అంటే వారం రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 2,730 రూపాయలు పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా 3,010 రూపాయలు పైకెగసింది.

రికార్డు స్థాయిలో వారం రోజులు పెరుగుదల చూపించింది. ఈ వారంలో చూసుకుంటే జూలై 27వ తేదీ గరిష్టంగా 730 రూపాయలకు పైగా పెరిగింది. శ్రావణ మాసం కావడం.. అంతర్జాతీయంగా పెరుగుతున్న బంగారం ధరలు దేశీయంగానూ బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. ఆ ప్రభావం హైదరాబాద్ మార్కెట్ మీద కూడా పడింది. కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో.. మదుపరులు కూడా బంగారం పై పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుండడం కూడా బంగారం ధరలు ఆకాశాన్ని తాకడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.

శాంతించని వెండి ధరలు!

ఇక దేశీయంగా వెండి ధరలు కూడా పసిడికి ఏమాత్రం తగ్గలేదు. వారం మొత్తంలో ఒక్క రోజు తప్ప మిగిలిన అన్నిరోజులూ వెండి ధరలు పైకి దూసుకుపోతూనే వచ్చాయి. జూలై 27 సోమవారం కేజీ వెండి ధర 64,700రూపాయలు. వారాంతానికి వచ్చేసరికి 65,110 రూపాయలకు చేరుకుంది. మధ్యలో జూలై 30 వ తేదీన ఒక్కసారిగా 3050 రూపాయలు తగ్గుదల నమోదు చెసి నమోదు చేసి 63,000 రూపాయలకు చేరుకుంది. ఆ ఒక్కరోజు తప్ప మరి వారంలో ఏరోజూ వెండి ధరలు శాంతించలేదు. దీంతో శనివారం సాయంత్రానికి 65,110 వద్ద కేజీ వెండి ధరలు నిలిచాయి.

ఇక శ్రావణ మాసం కావడంతో రాబోయే వారంలోనూ బంగారం ధరలలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories