అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై వైసీపీ పోస్టుమార్టం

YS Jagan Holds Meeting in Tadepalli to Review on Results
x

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై వైసీపీ పోస్టుమార్టం

Highlights

తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్‌ ఆధ్వర్యంలో నేతలు సమావేశమయ్యారు.

AP Election Results 2024: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై వైసీపీ పోస్టుమార్టం చేస్తోంది. తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్‌ ఆధ్వర్యంలో నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, కొడాలి నాని, పేర్నినాని హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తున్నారు నేతలు. భవిష్యత్‌ కార్యాచరణపైనా ఈ సమావేశంలో చర్చ జరిపే అవకాశాలున్నాయి.

ఇక పలితాలు వెలువడగానే వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. మరోవైపు జగన్ ప్రభుత్వంలో సలహాదారులుగా వ్యవహరించిన వారంతా వరుసగా రాజీనామాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories