Chandrababu Naidu: ఐదేళ్ల పాటు పోలవరం పూర్తిచేయడానికి కష్టపడ్డాం

We struggled to complete Polavaram for five years Says Chandrababu Naidu
x

Chandrababu Naidu: ఐదేళ్ల పాటు పోలవరం పూర్తిచేయడానికి కష్టపడ్డాం

Highlights

Chandrababu Naidu: కానీ గత ప్రభుత్వం మా కష్టాన్ని బూడిదపాలు చేసింది

Chandrababu Naidu: వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో పోలవరం ప్రాజెక్టు డయాఫ్రంవాల్ దెబ్బతిందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం గతంలో పడిన శ్రమను జగన్ సర్కార్ బూడిదపాలు చేసిందని ఆయన మండిపడ్డారు. ఎన్నో ఆటంకాల తర్వాత పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును నాశనం చేసిందని చంద్రబాబు ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories