Varahi Yatra: రేపటి నుంచి వారాహి యాత్ర.. పవన్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ..!

Varahi Yatra From Tomorrow
x

Varahi Yatra: రేపటి నుంచి వారాహి యాత్ర.. పవన్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ..!

Highlights

Varahi Yatra: టీడీపీ-జనసేన పొత్తుతో వారా‍హియాత్రపై పెరిగిన అంచనాలు

Varahi Yatra: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ మరోసారి వారా‍హియాత్ర ద్వారా ప్రజలతో మమేకం కానున్నారు. ఇప్పటికే మూడు దశల్లో వారా‍హియాత్రను పవన్‌ నిర్వహించారు. ఇక.. రేపటి నుంచి ఉమ్మడి కృష్ణాజిల్లాలో 4వ విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభతో ఈ యాత్ర ప్రారంభమవుతుంది.

టీడీపీ-జనసేన పొత్తు తర్వాత జరుగుతున్న యాత్ర కావడంతో.. ఈసారి వారాహియాత్రపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నాలుగో విడత వారాహియాత్ర 5 రోజుల పాటు జరగనుంది. ఇక.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో వారాహియాత్ర సాగనుంది. అవనిగడ్డ సభ అనంతరం.. జనసేనాని మచిలీపట్నం చేరుకుంటారు. 2, 3 తేదీల్లో అక్కడే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. 2న కృష్ణా జిల్లా జనసేన నాయకులతో పవన్‌ సమావేశమవుతారు. 3న జనవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలపై ఆర్జీలను స్వీకరిస్తారు. 4న పెడన, 5న కైకలూరు నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories