Varahi Yatra: నేటితో ముగియనున్న వారాహి విజయయాత్ర

Varahi Vijaya Yatra will End today
x

Varahi Yatra: నేటితో ముగియనున్న వారాహి విజయయాత్ర

Highlights

Varahi Yatra: సాయంత్రం భీమవరంలో జనసేన బహిరంగ సభ

Varahi Yatra: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయయాత్ర మొదటి విడత నేటితో ముగియనుంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సాయంత్రం జనసేన బహిరంగ సభ జరగనుంది. ఈ సభలోనే పవన్ కల్యాణ్ ఎక్కడనుంచి పోటీ చేస్తారనేది ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముద్రగడ లేఖాస్త్రంతోపాటు వైసీపీ నేతల సవాల్‌ల నేపథ్యంలో...బహిరంగ సభలో పవన్ కల్యాణ్‌ ఏం మాట్లాడతారనేది ఉత్కంఠగా మారింది. సాయంత్రం 5గంటలకు అంబేద్కర్ సెంటర్‌లో సభ ప్రారంభం కానుంది. సభకు భారీఎత్తున జనసైనికులు జనసమీకరణ చేస్తున్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో వారాహి విజయయాత్ర 16 రోజులపాటు కొనసాగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories