తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం

TTD emergency meeting on Tirumala Laddu dispute
x

తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం

Highlights

ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో భేటీ

తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి భేటీ అయ్యారు. ప్రధాన అర్చకుడు, పండితులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆలయం సంప్రోక్షణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తిరుమల లడ్డూ కల్తీపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఏపీ సర్కార్‌ ఆదేశించింది. ఈ నేపథ్యంలో సాయంత్రం సీఎం చంద్రబాబుకు తిరుమల లడ్డూ కల్తీపై నివేదిక ఇవ్వనున్నారు టీటీడీ ఈవో శ్యామలరావు.

Show Full Article
Print Article
Next Story
More Stories