Engineering Fee: ఏపీ విద్యార్థులకు బిగ్ షాక్..ఫీజులపై సర్కార్ కీలక ప్రకటన..బీటెక్ కోర్సులకు రూ. 1.03లక్షలు

Engineering Fee: ఏపీ విద్యార్థులకు బిగ్ షాక్..ఫీజులపై సర్కార్ కీలక ప్రకటన..బీటెక్ కోర్సులకు రూ. 1.03లక్షలు
x

Engineering Fee: ఏపీ విద్యార్థులకు బిగ్ షాక్..ఫీజులపై సర్కార్ కీలక ప్రకటన..బీటెక్ కోర్సులకు రూ. 1.03లక్షలు

Highlights

Engineering Fee: ఏపీ సర్కార్ అన్ని అంశాలపై ఫోకస్ పెడుతోంది. పాలనలో అన్ని శాఖల్లో పని మొదలు పెట్టారు. తాజాగా ఇంజనీరింగ్ ఫీజులను సైతం ఖరారు చేసింది.

Engineering Fee:ఏపీ ప్రభుత్వం 210 బీటెక్, రెండు ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కాలేజీలకు 2024-25 సంవత్సరానికి గాను ఫీజులు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీరింగ్ లో బీటెక్ కోర్సులకు అత్యధికంగా రూ. 1.03లక్షల నుంచి రూ. 1.05 లక్షలు, అత్యల్పంగా రూ. 40వేల చొప్పున నిర్ణయించారు. దీనిలో రూ. 40వేల ఫీజు ఉన్న కాలేజీలు 114, రూ. లక్షకు పైగా ఫీజులు ఉన్న కాలేజీలు 8 ఉన్నాయి. రెండు ఆర్కిటెక్చర్ కాలేజీలకు రూ. 35వేల చొప్పున ఫీజును ఖరారు చేశారు. ట్యూషన్, అఫిలియేషన్, గుర్తింపుకార్డు, మెడికల్, ఆటలు, సాంస్క్రుతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు వంటి ఖర్చులన్నీ ఈ రుసుములోకే వస్తాయి. అదనంగా కాలేజీలు వసూలు చేయరాదు.

వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, ఎంట్రెన్స్ రిఫండబుల్ ఫీజులు ఇందులో చేర్చలేదు. నిర్ణయించిన ఫీజులకు మించి అదనంగా క్యాపిటేషన్, డొనేషన్లను వంటి పేరుతో ఎలాంటి మొత్తమూ వసూలు చేయూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పెండింగ్ లో ఉన్న రిట్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పునకు లోబడి రుసుములు ఉంటాయని ఉత్తర్వుల్లో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ పేర్కొన్నారు.

గుంటూరులోని ఆర్వీఆర్అండ్ జేసీ, విశాఖలోని గాయత్రీ విద్యాపరిషత్ విద్య సంస్థలు, విజయవాడలోని ప్రసాద్ వి పుట్లూరు సిద్ధార్థ, వీఆర్ సిద్ధార్థ, భీమవరంలోని ఎస్ ఆర్ కేఆర్, శ్రీవిష్ణు ఇంజనీరింగ్ కాలేజీ ఫర్ ఉమెన్ కాలేజీలకు రూ. 1.05లక్షల చొప్పున, విష్ణు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలకు రూ. 1.03 లక్షలుగా ఖరారు చేశారు. విశాఖలోని GVP కాలేజీ డిగ్రీ, పీజీ కాలేజీకి రూ. 92,400 పెద్దాపురంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు రూ. 93,700గా ఉంది.

ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ ఫీజుల ప్రకారం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉందో తెలుసుకుని దాని ప్రకారం భవిష్యత్తును రూపొందించుకోవాలి. ఫీజులు భారీగానే ఉన్నట్లు కనిపిస్తున్నా ..ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టీ సర్కార్ ఈ ధరలను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories