Road Accident: అనంతపురం నాయనపల్లి వద్ద లారీ, కారు ఢీ కొని ఆరుగురు మృతి

Road Accident In Anantapur District
x

Road Accident: అనంతపురం నాయనపల్లి వద్ద లారీ, కారు ఢీ కొని ఆరుగురు మృతి

Highlights

Road Accident: అనంతపురం జిల్లా నాయనపల్లి క్రాస్ రోడ్డు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు.

Road Accident: అనంతపురం జిల్లా శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ రోడ్డు వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం - కడప హైవేపై కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తోన్న ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను అనంతపురానికి చెందిన సంతోష్, షణ్ముక్, వెంకన్న, శ్రీధర్, ప్రసన్న, వెంకీగా గుర్తించారు.

వేగంగా వెళ్తున్న కారు టైర్ పగిలి అదుపు తప్పి ఎదురుగా వస్తోన్న లారీ కిందకు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. తాడిపత్రిలో జరిగిన నగర కీర్తన కార్యక్రమంలో పాల్గొని తమ స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది అని మృతుల బంధువులు తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories