Rk Roja: జనాన్ని మాయ చేసినట్లు.. తిరుమల శ్రీవారిని మోసం చేయలేరు

RK Roja
x

RK Roja

Highlights

Rk Roja: చంద్రబాబుపై మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.

Rk Roja: చంద్రబాబుపై మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. అందుకే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. జనాలను మోసం చేసినట్లు శ్రీవారిని మోసం చేస్తే కుదరదన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో అబద్ధపు హామీలు ఇచ్చారన్నారు రోజా.

తిరుమల లడ్డూ వివాదంపై తాము సీబీఐ విచారణ కోరుతున్నామని.. గతంలో కుల రాజకీయాలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఈ విచారణకైనా సిద్ధమని.. సీబీఐ, సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిగినా తమకు అభ్యంతరం లేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories