Tadipatri: ఏపీ పోలీసుల అలెర్ట్.. వైసీపీ, టీడీపీ నేతల ఇండ్ల వద్ద ముళ్ళ కంచె ఏర్పాటు

Tadipatri
x

Tadipatri: ఏపీ పోలీసుల అలెర్ట్.. వైసీపీ, టీడీపీ నేతల ఇండ్ల వద్ద ముళ్ళ కంచె ఏర్పాటు

Highlights

Tadipatri: జూన్ 4వ తేదీ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో తాడిపత్రిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

Tadipatri: జూన్ 4వ తేదీ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో తాడిపత్రిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పోలింగ్ రోజు, తర్వాత రోజు జరిగిన ఘర్షణ నేపథ్యంలో తాడిపత్రిలో భారీగా పోలీసులను మోహరించి శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చారు. తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల కౌంటింగ్ దృశ్య ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాల వద్ద పోలీసులు ముళ్ళ కంచె ఏర్పాటు చేశారు.

కౌంటింగ్ అనంతరం అల్లర్లు జరుగుతాయన్న ఇంటలిజెన్స్ హెచ్చరికలతో తాడిపత్రికి భారీగా కేంద్ర సాయుధ బలగాలు, ఏపీఎస్పీ బలగాలు వచ్చాయి. జూన్ 6వ తేదీ వరకు తాడిపత్రిలోకి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి వెళ్లవద్దని హైకోర్టు ఆంక్షలు విధించింది. ఈ నైపథ్యంలో పోలీసులు తాడిపత్రి చుట్టుపక్కల చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తాడిపత్రిలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రాళ్ల దాడి కేసులో ఇప్పటికే 121 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories