Pawan Kalyan: వారాహియాత్రతో మరోసారి జనంలోకి జనసేన అధినేత

Pawan Kalyan Fourth Leg of Varahi Yatra
x

Pawan Kalyan: వారాహియాత్రతో మరోసారి జనంలోకి జనసేన అధినేత 

Highlights

Pawan Kalyan: ఇవాళ్టి నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో 4వ విడత యాత్ర

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ 4వ విడత వారాహి యాత్ర ఇవాళ్టి నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభతో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. మరోసారి వారా‍హియాత్ర ద్వారా ప్రజలతో మమేకం కానున్నారు పవన్‌కల్యాణ్. ఇప్పటికే మూడు దశల్లో వారా‍హియాత్రను నిర్వహించారు.

అవనిగడ్డ సభ అనంతరం.. జనసేనాని మచిలీపట్నం చేరుకుంటారు. 2, 3 తేదీల్లో అక్కడే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. 2న కృష్ణా జిల్లా జనసేన నాయకులతో పవన్‌ సమావేశమవుతారు. 3న జనవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలపై ఆర్జీలను స్వీకరిస్తారు. 4న పెడన, 5న కైకలూరు నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటిస్తారు.

టీడీపీ-జనసేన పొత్తు తర్వాత జరుగుతున్న యాత్ర కావడంతో.. ఈసారి వారాహియాత్రపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అటు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వారాహియాత్రకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ నాలుగో విడత వారాహియాత్ర 5 రోజుల పాటు జరగనుంది. ఇక.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో వారాహియాత్ర సాగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories