Tirumala: కల్యాణ మండపానికి మొదటి భార్య.. పెళ్లిపీటలపై నుంచి వరుడు పరార్..‌!

Representational Image
x

Representational Image

Highlights

రాకేష్ తిరుమలలో పెళ్లి చేసుకుంటున్న సమాచారం తెలుసుకున్న మొదటి భార్య సంధ్య హైదరాబాదు నుంచి కళ్యాణ మండపానికి రావడంతో అక్కడ నుంచి రాకేష్ అతని కుటుంబ సభ్యులు పరారయ్యారు.

Tirumala: తిరుమలలో వివాహం వివాదంగా మారింది. ఓ ప్రైవేట్ మఠంలో హైదరాబాదుకు చెందిన రాకేష్ అనే వ్యక్తి వివాహం మొదటి భార్య ఎంట్రీతో ఆగిపోయింది. రాకేష్ తిరుమలలో పెళ్లి చేసుకుంటున్న సమాచారం తెలుసుకున్న మొదటి భార్య సంధ్య హైదరాబాదు నుంచి కళ్యాణ మండపానికి రావడంతో అక్కడ నుంచి రాకేష్ అతని కుటుంబ సభ్యులు పరారయ్యారు. దీంతో మొదటి భార్య సంధ్య తిరుమల పోలీసులను ఆశ్రయించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

రాకేష్ తనకు తెలియకుండా తిరుమలలో రెండో వివాహం చేసుకుంటున్నట్లు సమాచారం అందిందని తెలంగాణలోని వరంగల్‌ జిల్లా పెద్ద పెండ్యాలకు చెందిన సంధ్య తెలిపారు. రాకేశ్‌తో విడాకుల విషయంపై న్యాయస్థానంలో కేసు నడుస్తోందని.. అయినప్పటికీ ఆయన రెండో పెళ్లికి సిద్ధమయ్యారని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకుని తిరుమల వచ్చి వివాహం ఆపేశానని.. తనతో పాటు కుమార్తెకు పోలీసులు న్యాయం చేయాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories