AP News: వరద బాధితులకు రేపటి నుంచి నిత్యావసరాల కిట్ల పంపిణీ

Distribution of necessities to flood victims from tomorrow
x

AP News: రేపటి నుంచి వరద బాధితులకు నిత్యవసరాల పంపిణీ

Highlights

AP News: వరద బాధితులందరికి నిత్యవసరాలు పంపిణీ చేసేలా చర్యలు

AP News: విజయవాడలో వరద బాధితులకు రేపటి నుంచి ప్రభుత్వం నిత్యవసరాలు పంపిణీ చేయనుంది. పంపిణీ ఏర్పాట్లపై ఇప్పటికే మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. బాధితులకు 25 కేజీల బియ్యం బస్తా, 2 కేజీల ఉల్లిపాయలు, కేజీ కందిపప్పు, 2 కేజీల బంగాళా దుంపలు, లీటరు పామాయిల్‌ను ప్రభుత్వం ఇవ్వనుంది. వరద బాధితులందరికి నిత్యవసరాలు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

తొలి విడతగా 50 వేల కుటుంబాలకు ఈ సాయం అందించబోతోంది కూటమి ప్రభుత్వం. మొత్తంగా 2 లక్షల 50 వేల నిత్యావసరాల కిట్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సహాయక చర్యలు వేగవంతం చేసిన ఏపీ సర్కార్.. పెద్ద ఎత్తున అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories