Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Continual Rush Of Devotees In Tirumala
x

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ 

Highlights

Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూలో వేచి ఉన్నారు భక్తులు. ఎలాంటి టోకెన్లు లేనివారికి 20 గంటల సమయం పడుతోంది. 3వందల ప్రత్యేక ప్రవేశదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. వీరికి శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. ఈ రద్దీ వారాంతం వరకు కొనసాగే అవకాశం ఉందంటున్నారు. తిరుమలలో భక్తుల రద్దీపై మరింత సమాచారాన్ని మా తిరుమల ప్రతినిధి సురేష్ అందిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories