సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కీలక సమావేశం.. పార్టీ ఎమ్మెల్యేలు చేస్తోన్న తప్పిదాలపై వార్నింగ్

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కీలక సమావేశం.. పార్టీ ఎమ్మెల్యేలు చేస్తోన్న తప్పిదాలపై వార్నింగ్
x

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కీలక సమావేశం.. పార్టీ ఎమ్మెల్యేలు చేస్తోన్న తప్పిదాలపై వార్నింగ్

Highlights

CM Chandrababu: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో నేడు కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

CM Chandrababu: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో నేడు కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కూటమి సర్కార్ ఏర్పాటై 125 రోజులు పూర్తయిన సందర్భంగా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక భేటీ నిర్వహించనున్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు టీడీపీ బాస్.

కూటమి సర్కార్ సాధించిన విజయాలు, అమలు చేసిన హామీలపై ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు సీఎం. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రవేశపెట్టనున్న కొత్త పాలసీలపై ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించనున్నారు. ఇక మద్యం, ఇసుక వ్యవహారాల్లో టీడీపీ ఎమ్మెల్యేలపై వస్తోన్న ఆరోపణలపై వార్నింగ్ ఇవ్వనున్నారు. పద్ధతి మార్చుకోవాలని సూచిస్తూ మరోసారి ఎమ్మెల్యేలకు చెప్పనున్నారు చంద్రబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories