వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తి ఆయన భార్యకు రాదా?: చంద్రబాబు

Chandrababu Naidu
x

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తి ఆయన భార్యకు రాదా?: చంద్రబాబు

Highlights

Chandrababu Naidu: తల్లి, చెల్లితో జరిగిన గొడవలలో మమ్మల్ని లాగుతున్నారని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు చెప్పారు.

Chandrababu Naidu: తల్లి, చెల్లితో జరిగిన గొడవలలో మమ్మల్ని లాగుతున్నారని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు చెప్పారు. గురువారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబంలో ఆస్తుల గొడవను అడ్డుపెట్టుకొని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబుపై వైఎస్ జగన్ విమర్శలు చేశారు. ఈ విమర్శలపై ఆయన కౌంటరిచ్చారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తి ఆయన భార్యకు రాదా అని ఆయన ప్రశ్నించారు 2004లో జగన్ ఆదాయం ఎంత? అని ఆయన అడిగారు. ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన జగన్ ను ప్రశ్నించారు. వ్యవసాయం చేసి సంపాదించారా అని ఆయన సెటైర్లు వేశారు.ఇలాంటి వాళ్లతో రాజకీయాలు చేయడం సిగ్గుగా ఉందని సీఎం చెప్పారు. విలువలు లేని మనుషులు సమాజానికి చేటన్నారు.

జగన్ ఏమన్నారంటే?

పాలన వదిలేసి డైవర్షన్ కోసం తన తల్లి, చెల్లి గురించి ప్రచారం చేస్తారా అని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రశ్నించారు. తమ కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా? అని అడిగారు. ఇవన్నీ అన్ని ఇళ్లలో ఉండే సమస్యలే అని జగన్ చెప్పారు. మీ ఇళ్లలో ఇలాంటి కుటుంబ గొడవలు ఏమీ లేవా.. ఇవన్నీ ప్రతి ఇంటి కథలేనని ఆయన తెలిపారు. మీ స్వార్థం కోసం పెద్దవి చేసి చూపించడం, నిజాలు లేకపోయినా..వక్రీకరించి చూపించడం మానుకోవాలని ఆయన చంద్రబాబుకు సూచించారు.కుటుంబ ఆస్తుల విషయమై జగన్ గురువారం స్పందించారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories