Telangana live updates: ఖమ్మం జిల్లా
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను అడవి పందుల భారీ నుంచి కాపాడుకోవడానికి వినూత్న పద్దతిని పాటిస్తున్నారు. మైకు ద్వారా కుక్క, పులి, నక్క అరుపులను రికార్డు చేసుకొని పంట పొలాల చుట్టు మైకులు అమర్చారు. ఎలుగుబంటి వేశాలు వేసుకొని తిరుగాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
Update: 2021-02-20 01:13 GMT