కాళేశ్వరంపై కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు

నీటి పారుదల రంగానికి ఈ బడ్జెట్ లో రూ,22,301 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతం 24 భారీ, 7 మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని భట్టి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు, డిజైన్ల లోపాలు, నాణ్యత లేకుండా నిర్మాణాలు చేయడంతో ఆ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని ఆయన విమర్శించారు. ఈ ప్రాజెక్టులో అవకతవకలను గుర్తించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా భట్టి విక్రమార్క చెప్పారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Update: 2024-07-25 07:59 GMT

Linked news