ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు ప్రోత్సాహం

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను మరింత బలోపేతం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. హైద్రాబాద్ ను ఎఐలో అగ్రగ్రామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్టుగా భట్టి చెప్పారు. భవిష్యత్తులో ‎ఎఐ కంప్యూటర్ పరికరాలతో అత్యాధునిక కృత్రిమ మేధో పరిజ్ఞన పరిశోధక కేంద్రంగా రూపొందుతుందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. హైద్రాబాద్ లో ఈ ఏడాది సెప్టెంబర్ 5,6 తేదీల్లో ఎఐ మేధో శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన 2 వేల మంది హాజరు కానున్నారని ప్రభుత్వం తెలిపింది.

Update: 2024-07-25 07:47 GMT

Linked news