జీహెచ్ఎంసీలో మౌలిక వసతులకు రూ. 3,065 కోట్లు

జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతులకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో రూ.3,065 కోట్లు కేటాయించింది. హెచ్ఎండీఏలో కూడా మౌలిక వసతుల కోసం రూ.500 కోట్లను కేటాయించినట్టుగా ప్రభుత్వం తెలిపింది. మెట్రో వాటర్ వర్క్స్ కు రూ.3,385 కోట్లు, హైడ్రా సంస్థకు రూ. 200 కోట్లను కేటాయించినట్టుగా భట్టి విక్రమార్క వివరించారు. హైద్రాబాద్ నగర అభివృద్దికి రూ. 10 వేల కోట్లు కేటాయించారు. విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు రూ. 100 కోట్లు కేటాయించినట్టుగా ప్రభుత్వం వెల్లడించింది.

Update: 2024-07-25 07:02 GMT

Linked news