క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీ తొలగింపు

మూడు రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీ తొలగిస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. దీంతో ఈ మందుల ధరలు తగ్గనున్నాయి. 25 రకాల ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించనున్నట్టుగా కేంద్రం హామీ ఇచ్చింది. మొబైల్ , మొబైల్ పరికరాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి తగ్గించినట్టుగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సోలార్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. లెదర్ ఉత్పత్తులపై కూడా పన్ను తగ్గించారు. రొయ్యలు, చేపల ఫీడ్ పై బీసీడీ ఐదు శాతానికి తగ్గించారు.

Update: 2024-07-23 06:49 GMT

Linked news