అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ లో రూ. 15 వేల కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. అమరావతి నిర్మాణం కోసం బహుళ సంస్థల ద్వారా నిధులు అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.

విశాఖపట్టణం- చెన్నై, ఓర్వకల్లు-బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ కు నిధులు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఏపీ పునర్విభజన చట్టం -2024 కట్టుబడి ఉన్నామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం అభివృద్దికి నిధులు ఇస్తామని కేంద్రం ప్రకటించింది.

Update: 2024-07-23 06:01 GMT

Linked news