అమరావతి : - ఇంటర్మీడియెట్‌ పరీక్ష జవాబుపత్రాల... ... Live Updates:ఈరోజు (జూలై-03) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

అమరావతి : 

- ఇంటర్మీడియెట్‌ పరీక్ష జవాబుపత్రాల రీ వెరిఫికేషన్‌, మార్కుల రీకౌంటింగ్‌కు ఫస్ట్‌, సెకండియర్లకు కలిపి మొత్తం 37,048 దరఖాస్తులు ఇంటర్‌ బోర్డుకు అందాయి.

- ఇందులో రీవెరిఫికేషన్‌కు 28,742, రీకౌంటింగ్‌కు 8,306 దరఖాస్తులు ఉన్నాయి.

- రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌కు జూన్‌ 30 వరకు దరఖాస్తులు స్వీకరించారు.

- సాధారణంగా దరఖాస్తుల గడువు ముగిసిన వెంటనే  స్పాట్‌ వాల్యుయేషన్‌ క్యాంపుల నుంచి జవాబుపత్రాలను తెప్పించి రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ మొదలు పెడతారు.

- 15 రోజుల్లో దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తారు.

- కానీ కొవిడ్‌-19 నేపథ్యంలో ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు.

- దీంతో అభ్యర్థుల దరఖాస్తు ఫలితాలకు కనీసం మరో 20 రోజులు పట్టే అవకాశం ఉంది. 

Update: 2020-07-03 04:37 GMT

Linked news