ఆదాయ పన్ను స్లాబ్ లో మార్పులు

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో వేతన జీవులకు ఊరట కల్పించింది. స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మధ్యతరగతికి మేలు చేసేలా ఐటీ చట్టాన్ని సమీక్షిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆదాయ పన్ను స్లాబ్ ల్లో మార్పులు తెచ్చారు.

రూ.3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు 5 శాతం పన్ను.రూ. 7 లక్షల నుంచి రూ.10లక్షల వరకు 10 శాతం, రూ.10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు 15 శాతం పన్ను వసూలు చేయనున్నారు. ఈకామర్స్ పై టీడీఎస్ 0.1 శాతానికి తగ్గించారు. ఇన్వెస్టర్లకు యాంజెల్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్టుగా కేంద్రం హామీ ఇచ్చింది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద 12.5 శాతం పన్ను విధించనున్నట్టుగా నిర్మలా సీతారామన్ చెప్పారు.

Update: 2024-07-23 07:06 GMT

Linked news