
AP: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ముంబై నటి జెత్వానీ కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఆయనను హైదరాబాద్ లో అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం జగన్ కు ఆయన అత్యంత విధేయుడిగా వ్యవహరించారు.
ప్రస్తుతం పీఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి ఆయన్ను తరలిస్తున్నారు. జెత్వానీ కేసులో పూర్తిస్థాయిలో సీఐడీ అధికారులు విచారించనున్నారు.