పాకిస్తాన్ లాహోర్లోని కంటోన్మెంట్ ఏరియాలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. మసీదు సమీపంలో రద్దీగా ఉన్న బజారులో మిలటరి వాహనాలే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ పేలుళ్లలో 39మంది చనిపోయారు. దాదాపు 100మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందినవారిలో ఐదుగురు సైనికులున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పేలుళ్లతో పాకిస్తాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. లాహోర్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. |