అంతర్జాతీయ ముఖ్య వార్తలు
పూర్తి కధనం
No Image  

టర్కీలో సంభవించిన భూకంపం ఆరు గ్రామాలను అతలాకుతలం చేసింది. టర్కీ తూర్పు ప్రాంతంలోని ఎలాజిక్ రాష్ట్రంలో వచ్చిన భూకంపం దెబ్బకు 57మంది చనిపోయారు. మరిన్ని మృత దేహాలను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

భూకంపం ధాటికి చాలా చోట్ల కొండ చరియలు విరిగిపడటంతో మట్టితో కట్టిన ఇళ్లు, మసీదులన్నీ ధ్వంసమయ్యాయి. బాధితులంతా చిన్న చిన్న గుడారాలు వేసుకొని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు.

బాధితులను ఆదుకునేందుకు టర్కీ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఆహార పదార్థాలతో పాటు గాయపడిన వారికి వైద్య సేవలు అందిస్తోంది.

ప్రకటనలు
 
Image not found