|
దక్షిణ భారత తీర్థయాత్ర స్థలాలలో ప్రసిద్దిచెందిన కన్యాకుమారి సముద్రపు సోయగాలకు నెలవు. వేకువజామున నునులేత కిరణాలతో వెలుగు కిరణాలను ప్రసరింపజేసే సూర్యభగవానుడు అప్పుడే సముద్రగర్భం నుంచి ఉద్భవించినట్లు కనువిందు చేస్తాడు. సముద్రంలోని బండలపై నిర్మించిన స్వామి వివేకానంద మండపం, తిరువాళ్వార్ విగ్రహలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
దక్షిణ భారత దేశపు చివరి సరిహద్దు ఇందిరాపాయింట్ చూసేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తారు. కన్యకుమారి అందాలను చూసేందుకు విదేశీ పర్యాటకులు సైతం వస్తారు. ఇక్కడ కనిపించే సూర్యోదయం, సూర్యాస్తమయాలు తిలకించడం ఎనలేని ఆనందాన్నిస్తోందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ అందాల్ని చూశాక కన్యాకుమారి వెళ్ళాలనిపిస్తోంది కదూ ఇంకెందుకు ఆలస్యం చలో కన్యాకుమారి.
|