బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింటా అనుకోకుండా వరించిన అదృష్టం అక్కర్లేదంటోంది. లెజెండ్ ఫిల్మ్ మేకర్ కమల్ ఆమ్రోహి కుమారుడు శందర్ తన ఆస్థికి వారసురాలుగా ప్రీతిని ప్రకటించారు. ఆమ్రోహి స్టూడియోలో తనవాటా ప్రీతికే చెందుతుందని తెలిపారు. దీనివిలువ దాదాపు ఆరొందలకోట్ల పైమాటే. ఇక వివరాల్లోకి వెళ్తే ఆమ్రోహి ఆస్తి విషయంపై ఆరేడు సంవత్సరాలుగా వివాదం సాగుతోంది. చెల్లెలు రుక్సార్, మేనల్లుడు వసీమ్లు తన షేర్లను దొంగిలించారని, ఫోర్జరీ సంతకాలతో ఆస్థిని మళ్ళించుకున్నారంటూ అప్పట్లో శందర్ కేసు వేశారు. ఈవిషయంలో ఆమ్రోహికి మద్ధతుగా ప్రీతి నిలిచింది. చెల్లెలు, మేనల్లుడు చేసిన మోసంతో తీవ్ర మనస్థాపానికి గురైన శందర్ ఆమ్రోహి తనకు మద్ధతుగా ఉన్న ప్రీతినే సొంతకూతురు లాంటిదని, స్టూడియోలో తనవాటా ఆమెకే చెందుతుందని ప్రకటించాడు. తాజాగా ఈ ఎయిడ్స్ పై పోరాడేందుకు ఐక్యరాజ్యసమితి అంబాసిడర్గా ఎన్నికైన ప్రీతి అయాచితంగా వచ్చే ఆస్థులపై తనకు వ్యామోహం లేదంటోంది. సినిమాలు, క్రికెట్ నుంచి వస్తున్న ఆదాయం చాలని తేల్చిచెప్పింది. |