వార్తాకధనాలు
పూర్తి కధనం

ఎంతటి విన్యాసం అయినా వారు ఇట్టే చేస్తారు. పొట్టేలుతో గుండెలమీద ఢీకొట్టించుకున్నా, మీసాలతో లారీని లాగినా, అదంతా వారికే సాధ్యం. జానెడు పొట్టకోసం ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా  విన్యాసాలు చేస్తోన్న మాలమాస్టీలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం..

కులవృత్తులు కనుమరుగవుతున్న నేటీకాలంలో ఇంకా అదే వృత్తిలో కొనసాగుతున్నారు మాలమాస్టీలు. తూర్పుగోదావరి జిల్లాలోని  కొత్తగాసుగూడెంకి చెందిన మాలమాస్టీలు ప్రమాదకరమైన విన్యాసాలతో అలరిస్తు బతుకీడుస్తున్నారు. చూస్తున్నవారికి ఆశ్చర్యం, ఆనందం , ఆవేదన కలిగినా దాని వెనుక ప్రాణాలను సైతం లెక్కచేయని విన్యాసాలుంటాయి. రాజులకాలంలో సైనికులుగా పనిచేసిన మాలమాస్టీలు ఇప్పుడదే విన్యాసాలను కులవృత్తులుగా చేసుకున్నారు. కత్తులు, కటార్లతో  మాలమాస్ట్రీలు ఒళ్ళు గగుర్పుడిచే విన్యాసాలు చేస్తారు.
బండి చక్రాన్ని అవలీలగా ఎత్తడం, పది అడుగుల ఎత్తులో ఎగరడం వంటి విన్యాసాలు చూసేందుకు మన కళ్ళు చాలవు. పొట్టేలుతో ఢికొట్టించుకోవడం, మీసాలతో లారీని లాగడం వంటి అద్భుత విన్యాసాలతో ఆకట్టుకుంటారు.
తమను ఆదుకోవడంలో సర్కార్ విఫలమైందని మాలమాస్టీలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఉపాధి చూపితే ప్రాణాంతకమైన విన్యాసాల ప్రదర్శన మానివేస్తామని చెప్పారు. ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని మాలమాస్టీలు కోరుతున్నారు. 

ప్రకటనలు
 
Image not found