|
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. శనివారం సికింద్రాబాద్ లో జరిగే పార్టీ కార్యవర్గ సమావేశాల్లో అధికారికంగా ప్రకటిస్తారు. అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించిన బద్ధం బాల్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఎన్నిక లాంచనమే అయింది. గత 33ఏళ్లుగా పార్టీతో అనుబందమున్న కిషన్ రెడ్డి పార్టీ శాసనసభా పక్ష నేతగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే బీజేపీ శాసన సభా పక్షనేతగా ఉన్న కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ వివిధ హోదాల్లో పనిచేసిన కిషన్ రెడ్డి మంచి పేరు సంపాదించారు. బీజేపీలో 16సంవత్సరాలపాటు పుల్ టైమర్ గా ఉన్న కిషన్ రెడ్డి వివిధ అవార్డులు పొందారు. కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా తిమ్మాపురంలో జన్మించారు. టూల్ డిజైనింగ్ లో డిప్లమా చేశారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన ఆయన 1977లో జనతాపార్టీ యవ విభాగంలో చేరారు. ఆ తర్వాత 1980లో బీజేపీలో చేరారు. 1980 నుంచి 1995వరకు బీజేపీలో పుల్ టైమర్ గా పనిచేశారు. బీజేపీ యువమోర్చాఅధ్యక్షుడిగా పనిచేశారు. కిషన్ రెడ్డికి యునిసెఫ్ నుంచి చైల్డ్ ప్రెండ్లీ ఎమ్మెల్యే అవార్డువచ్చింది. అంతేకాక అమెరికాలోని యంఐబిఆర్టీ నుంచి ఔట్ స్టాండింగ్ యూత్ లీడర్ షిప్ అవార్డు వచ్చింది.విశ్వశాంతికి కృషి చేసింనందుకు బల్గేరియాలోని సోఫియా బల్గేరియన్ కమోండోస్ నుంచి మోడల్ ఇతర అవార్డులు వచ్చాయి. కిషన్ రెడ్డి వరల్డ్ యూత్ కౌన్సిల్ ఎగినెస్ట్ టెర్రరిజం సంస్థ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. యన్డీఏ హయాంలో జాతీయ యూత్ పాలసీ రూప కల్పనలో కీలక పాత్ర పోషించారు. కిషన్ రెడ్డి వివిధ అంతర్జాతీయ సంస్థల ఆహ్వనం మేరకు అమెరికా, చైనా, ఇజ్రాయెల్, బ్రిటన్, ప్రాన్స్, కెనడా దేశాలు పర్యటించారు. బీజేవైయం తరపున ఎనిమిది రాష్ట్రాల్లో సీమ సురక్ష జాగరణ యాత్ర నిర్వహించారు. ఎంఆర్పీఎస్ చేపట్టిన చిన్న పిల్లల ఆపరేషన్ల ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2004లో హిమాయత్ నగర్ నుంచి 2009లో అంబర్ పేట నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. కిషన్ రెడ్డి నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేశారు. కిషన్ రెడ్డి వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు హాజరయ్యారు |