Nirmal: అమానుషం.. కోతులను చంపి కాల్చుకుని తిన్న యాచకులు

Six Beggars Killed Monkeys To Eat In Bhainsa Mandal Of Nirmal District
x

Nirmal: అమానుషం.. కోతులను చంపి కాల్చుకుని తిన్న యాచకులు

Highlights

Nirmal: భైంసా మండలం చింతల్‌బోరి గ్రామంలో ఘటన

Nirmal: నిర్మల్ జిల్లాలో ఎవరూ ఊహించని ఒక ఘటన జరిగింది. ఎవరైనా మాంసాహారంగా ఏ కోడినో.. మేకనో వండుకుని తింటారు.. అయితే ఇక్కడ కొందరు వ్యక్తులు జనారన్యంలో జీవించే వానరాలను ఆహారంగా వండుకుని తినడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భైంసా మండలంలోని చింతల్‌బోరి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

గంగిరెద్దులతో భిక్షాటనే చేసే ఆరుగురు వ్యక్తులు మూడు రోజులుగా గ్రామంలో సంచరిస్తున్నారు. గ్రామంలో భిక్షాటన చేస్తూ గ్రామ సమీపంలో నివసిస్తున్నారు. అదే సమయంలో కొందరు వ్యక్తులు నాలుగు వానరాలను చంపి ఆహారంగా వండుకుని తినడం గ్రామంలో కలకలం రేపింది. సమాచారం తెలుసుకున్న కొందరు యువకులు వారు ఉంటున్న ప్రదేశానికి వెళ్లి పరిశీలించడంతో వానరాల అవశేషాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో వారు ఆగ్రహంతో వారిపై దాడికి యత్నించారు. వారు వండుకున్న పాత్రల్లోని ఆహారాన్ని గమనించి కోతులను చంపి వండుకుని తింటున్నట్లుగా గుర్తించారు.

అసలు కోతులను ఎందుకు చంపారని నిలదీయడంతో పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు.. అసలు కోతులను చంపి వండుకుని తినాల్సిన అవసరం ఏం వచ్చిందని గ్రామస్తులు వారిని ప్రశ్నించారు. వానరాలను చంపి వండుకుని తిన్న ఆరుగురిలో నలుగురు అక్కడ నుంచి పరారీలో ఉన్నారు. మరో ఇద్దరిని గ్రామస్తులు బంధించారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories