BJP: నేడు బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా.. తెలంగాణ నుంచి 8 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్

Second List of BJP Lok Sabha Candidates Today
x

BJP: నేడు బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా.. తెలంగాణ నుంచి 8 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్

Highlights

BJP: మ.12 గంటలకు జాబితా విడుదలయ్యే అవకాశం

BJP: బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మొదటి జాబితా ప్రకటించిన కాషాయ పార్టీ.. ఇవాళ రెండో జాబితా ప్రకటించనుంది. ఈ జాబితాలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవి లత పోటీ చేయనున్నారు.

జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, నాగర్ కర్నూలు నుంచి భరత్, చెవేళ్ల నుంచి కొండ విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేయనున్నారు. రెండో జాబితాలో తెలంగాణకు సంబంధించి ఏడుగురు పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, మెదక్ నుంచి రఘునందన్‌రావు, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, నల్గొండ నుంచి శానం సైదిరెడ్డి, పెద్దపల్లి నుంటి గోమాస శ్రీనివాస్, వరంగల్ నుంచి కృష్ణ ప్రసాద్ పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories