Vande Bharat: పట్టాలెక్కిన 'వందే భారత్‌' ట్రైన్‌.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ

Prime Minister Modi virtually inaugurated the Second Vande Bharat train between Visakha and secunderabad
x

Vande Bharat: పట్టాలెక్కిన 'వందే భారత్‌' ట్రైన్‌.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ

Highlights

Vande Bharat: సికింద్రాబాద్‌-విశాఖ మధ్య మరో వందే భారత్‌ రైలు

Vande Bharat: విశాఖ మీదుగా నేటి నుంచి మరో వందే భారత్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. విశాఖ-పూరీతో పాటు విశాఖ- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైళ్లు నడుస్తాయి. వీటిని ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. సికింద్రాబాద్‌ - విశాఖ మధ్య ఈ ట్రైన్ పరుగులు పెట్టనుంది. తెలంగాణలో మొదలయ్యే ఈ భారత్‌ శ్రేణిలో ఇది నాలుగవది. అయితే, ఇప్పటికే ఈ రెండు స్టేషన్ల మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు 100 శాతం ఆక్యుపెన్సీతో కొనసాగుతుంది.

ప్రయాణికుల డిమాండ్, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇదే మార్గంలో మరో వందే భారత్ రైలును ప్రవేశ పెట్టారు. ఈ రైలులో ఏడు ఏసీ ఛైర్ కోచ్‌లతో పాటు ఒక ఏసీ ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ఉంటాయి. ఈ రైలులో దాదాపు 530 మంది ప్రయాణం చేయొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories