Kishan Reddy: సింగరేణిని ప్రైవేట్‌పరం చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు..

No Privatisation Of Singareni Says Union Minister Kishan Reddy
x

Kishan Reddy: సింగరేణిని ప్రైవేట్‌పరం చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు

Highlights

Kishan Reddy: సింగరేణిని ప్రైవేట్‌పరం చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

Kishan Reddy: సింగరేణిని ప్రైవేట్‌పరం చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సింగరేణిని కేంద్రం ప్రైవేట్‌పరం చేయబోదని తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రం ఏటా.. 26వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని వెల్లడించారు. మోడీ ప్రధాని అయ్యాక వరి, పత్తి మద్దతు ధరను పెంచారని తెలిపారు. 6వేల, 338 కోట్లతో ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించామన్న కిషన్‌రెడ్డి.. RFCLతో రాష్ట్రంలో ఎరువుల కొరత తీరుతుందన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories