Kishan Reddy: కాంగ్రెస్‌, మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం

Kishan Reddy Key Comments
x

Kishan Reddy: కాంగ్రెస్‌, మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం

Highlights

Kishan Reddy: ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయరు

Kishan Reddy: కాంగ్రెస్‌, మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని చేశారన్నారు సీనియర్ ఎమ్మెల్యేలను కాదని ఏ ప్రాతిపదికన ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ తన పాత అలవాటు ప్రకారం శాసన సభ గౌరవాన్ని కాల రాసిందని చెప్పారు. అక్బరుద్దీన్‌ ఒవైసీని స్పీకర్ చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయరని... రెగ్యులర్ స్పీకర్ ఎన్నికైన తరువాత ప్రమాణ స్వీకారం చేస్తారని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories