KA Paul: అంబేద్కర్ చౌరస్తాలో చెప్పులు కుట్టిన కేఏ పాల్

KA Paul In the Munugode By Election Campaign
x

KA Paul: అంబేద్కర్ చౌరస్తాలో చెప్పులు కుట్టిన కేఏ పాల్

Highlights

KA Paul: రాజకీయాలు కాదు.. సామాజిక మార్పు లక్ష్యం

KA Paul: మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారంలో చెప్పులు కుట్టి, మాదిగల కష్టాలను గుర్తుకు తెచ్చారు. రాజకీయాలు చేయడంకాదు... సామాజిక మార్పుకోసమే మునుగోడు ఎన్నికల్లో పోటీచేస్తున్నానని తెలిపారు. నల్లగొండ జిల్లా మునుగోడు అంబేద్కర్ చౌరస్తాలో కెఏ పాల్ చెప్పులు కుట్టుతూ.. వినూత్న ప్రచారం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో చెప్పులు కుట్టే వారికి రోజుకు కనీసం 300 రూపాయలు రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సామాజిక మార్పు తెచ్చేందుకు ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కేఏపాల్ ఓటర్లను అభ్యర్థించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories