మునుగోడులో జంబో దీపావళి ఉత్సవాలు.. ఓటర్ల మధ్యే పండుగ జరుపుకోనున్న నేతలు

Jumbo Diwali Celebrations in Munugode
x

మునుగోడులో జంబో దీపావళి ఉత్సవాలు.. ఓటర్ల మధ్యే పండుగ జరుపుకోనున్న నేతలు 

Highlights

Munugode: పండగ రోజు సాయంత్రం ఇంటింటికి తిరిగి నేతల ప్రచారం

Munugode: మునుగోడులో జంబో దీపావళి ఉత్సవాలు కనువిందు చేయబోతున్నాయి. పార్టీల నేతల సందడితో సంబరాలు అంబారాన్ని అంటనున్నాయి. అన్ని పార్టీల నేతలు పండుగను ఓటర్ల మధ్యే జరుపుకోనున్నారు. మునుగోడు వీడి బయటికి రావద్దని నేతలకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీపావళి సందర్భంగా ఇంటింటికి స్వీట్స్ బాక్సులు, క్రాకర్స్ పంచడానికి నేతలు రెడీ అయ్యారు. గిఫ్ట్ ప్యాక్ కోసం ఇప్పటికే ప్రధాన పార్టీలు బల్క్‌గా ఆర్డర్స్ ఇచ్చాయి. ఇంచార్జీగా ఉన్న గ్రామాల్లో పండగ రోజు సాయంత్రం ఇంటింటికి తిరిగి నేతలు ప్రచారం చేయనున్నారు. కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనాలలో అన్ని పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. 26న గొల్లకుర్మలతో టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories