TS News: కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం

Everything Is Ready For KCR Bus Yatra
x

TS News: కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం 

Highlights

TS News: రేపటి నుంచి మే 10 వరకూ యాత్ర షెడ్యూల్

TS News: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం చేశారు. రేపటి నుంచి మే 10వ తేదీ వరకు బస్సు యాత్ర కొనసాగనున్నది. 17 రోజుల పాటు 12 లోక్ సబ స్థానాల్లో రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు. కేసీఆర్ యాత్ర కొనసాగించనున్న బస్సుకు తెలంగాణ భవన్ లో గులాబీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు ఉండే విదంగా బస్సు యాత్రకు ప్లాన్ చేశారు. రేపు ఉదయం తెలంగాణ భవన్ నుంచి బయల్దేరి మిర్యాలగూడ చేరుకొని.. అక్కడి నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.

మే 10వ తేదీన సిద్ధిపేటలో బస్సు యాత్ర ముగియనున్నది. బస్సు యాత్రలో రైతుల అంశం ప్రధాన అజెండాగా ఉండబోతుంది. ఎండిన పంట పొలాలను పరిశీలించడంతో పాటు సాగు నీరు, రైతులకు రైతు బంధు, పంటలకు బోన్ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ అడిగి తెలుసుకుంటారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన అస్త్రంగా చేసుకోబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories