Nizamabad: బిక్షం అడిగిన యాచకుడిని కాలుతో తన్నిన డిప్యూటీ తహసీల్దార్‌.. టిప్పర్‌ కిందపడ్డ అక్కడికక్కడే మృతి..

Nizamabad: బిక్షం అడిగిన యాచకుడిని కాలుతో తన్నిన డిప్యూటీ తహసీల్దార్‌.. టిప్పర్‌ కిందపడ్డ అక్కడికక్కడే మృతి..
x

Nizamabad: బిక్షం అడిగిన యాచకుడిని కాలుతో తన్నిన డిప్యూటీ తహసీల్దార్‌.. టిప్పర్‌ కిందపడ్డ అక్కడికక్కడే మృతి..

Highlights

Nizamabad: నిజామాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది.

Nizamabad: నిజామాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మెండోరా డిప్యూటీ తహసీల్దార్‌ రాజశేఖర్‌ నిర్ధాక్షిణ్యంగా ప్రవర్తించారు. బిక్షం అడిగిన యాచకుడిని కాలుతో తన్నాడు రాజశేకర్. దీంతో యాచకుడు పక్కన వెళ్తున్న టిప్పర్‌ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్మూర్‌లోని మామిడిపల్లి చౌరస్తాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు శివరాం స్థానిక కూడలి వద్ద కార్లను తూడుస్తూ యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడు.

గురువారం సాయంత్రం మెండోరా మండల డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ కారు సిగ్నల్ వద్ద ఆగి ఉండగా.. శివరాం కారు గ్లాస్ ను క్లీన్ చేశాడు. అనంతరం డబ్బులు ఇవ్వాలని కోరగా రాజశేఖర్ లేవని చెప్పాడు. అంతలోనే గ్రీన్ సిగ్నల్ పడడంతో కారు వెంబడి శివరాం పరుగుపెట్టాడు. అయితే కారు నుంచి దిగిన రాజశేఖర్ కోపంతో ఊగిపోయాడు. శివరాంను కాలితో తన్నడంతో అటుగా వస్తున్న టిప్పర్ వెనుక టైర్ల కిందపడి బాధితుడు దుర్మరణం చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రాజశేఖర్‌, టిప్పర్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories