తెలంగాణకు ఇవాళ అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్

Amit Shah and Rajnath Singh to Telangana today
x

తెలంగాణకు ఇవాళ అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్

Highlights

Telangana: భువనగిరిలో కేంద్రమంత్రి అమిత్ షా బహిరంగ సభ

Telangana: తెలంగాణలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు బీజేపీ అగ్రనేతలు వరస పర్యటనలు చేస్తున్నారు. నిన్నటి వరకూ ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించగా...ఇవాళ అమిత్ షా‌తో పాటు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పర్యటించనున్నారు.

భువనగిరి ఎంపీ అభ్యర్థికిగా బూర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా అమిత్‌ షా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు చేరుకుని, పార్టీ నేతలతో సమావేశమై రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అమిత్ షా సభ విజయవంతం చేయడం కోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో స్థానిక ఎంపీ అభ్యర్థికి మద్దతుగా రాజ్‌నాథ్‌సింగ్ ప్రచారం నిర్వహిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories