Suchana Seth: జోల పాట పాడి.. నిద్రపుచ్చి.. చంపేశాను

Suchana Seth Sang A Lullaby To Her Son Before Murder
x

Suchana Seth: జోల పాట పాడి.. నిద్రపుచ్చి.. చంపేశాను

Highlights

Suchana Seth: జోలపాట పాడి నిద్రపుచ్చిన తర్వాత చంపేసినట్టు చెప్పిన సేథ్

Suchana Seth: ఏఐ కంపెనీ మైండ్ ఫుల్ సీఈవో సుచన సేథ్.. కన్న కొడుకుని చంపిన కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఆమెను కస్టడీకి తీసుకున్న పోలీసులు.. హత్య ఎలా చేశారు అనే విషయాలను రాబడుతున్నారు. నాలుగేళ్ల కన్న కొడుకును చంపే ముందు ఏం చేశారు.. అనే విషయాలను ఆమె చెబుతుంటే.. పోలీసులు సైతం అవాక్కవుతున్నారు.

తన కుమారుడిని..మాజీ భర్తకు ఇవ్వాలనే ఉద్దేశం లేదు. కోర్టు ఆదేశాలు వ్యతిరేకంగా ఉన్నాయి. తన మాజీ భర్తకు.. కొడుకును ఇచ్చినట్లయితే చెడిపోతాడు అన్న ఉద్దేశంతో చంపాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో వెల్లడించింది సుచనా సేథ్. కుమారుడిని చంపాలని నిర్ణయించుకున్నప్పుడు.. దగ్గు మందు సిరప్ ఎక్కువ తాగించాను.. ఆ తర్వాత ఒళ్లో పడుకోబెట్టుకుని జోలపాట పాడాను. జోలపాట పాడుతుంటే తన కొడుకు నిద్రపోయాడు. దగ్గు మందు వల్ల గాఢ నిద్రలోకి వెళ్లాడు. ఆ తర్వాత..కుమారుడి ముఖంపై దిండు ఉంచి.. ఊపిరి ఆడకుండా చేశాను.. చనిపోయాడు అని నిర్థారించుకున్న తర్వాత.. అప్పటికే తెచ్చుకున్న పెద్ద బ్యాగులో కుమారుడి మృతదేహాన్ని ఉంచాను.. వాడు ఎంతో ఇష్టంగా ఆడుకునే బొమ్మలను వాడిపై పెట్టానని విచారణలో సుచనా సేథ్ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories