Congress: 43 మంది అభ్యర్థులతో.. కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ రిలీజ్

Second List Of Congress Lok Sabha Candidates Released
x

Congress: 43 మంది అభ్యర్థులతో.. కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ రిలీజ్

Highlights

Congress: రెండో జాబితా విడుదల చేసిన కేసీ వేణుగోపాల్

Congress: కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ రిలీజ్ అయింది. ఇప్పటికే 39 మంది పేర్లను ప్రకటించిన హస్తం పార్టీ..తాజాగా..43 మందితో రెండో జాబితా విడుదల చేసింది. ఢిల్లీలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో ప్రధానంగా అసోం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌కు చెందిన అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్ మధ్యప్రదేశ్‌లోని చింద్వారా నుంచి బరిలోకి దిగనున్నారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ కు జాలోర్ సీటు కేటాయించారు. ఇక గౌరవ్ గగోయ్ అసోంలోని జోరాట్‌ నుంచి పోటీ చేయనున్నారు. మొత్తంగా..సెకండ్ లిస్ట్‌లో 33 స్థానాలను ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించింది కాంగ్రెస్ హైకమాండ్.

Show Full Article
Print Article
Next Story
More Stories