PM Modi: రేపు అయోధ్యకు ప్రధాని మోడీ.. భారత్‌ - నేపాల్‌ సరిహద్దుల్లో నిఘాను పటిష్ఠం చేసిన భద్రత బలగాలు..

PM Modi to visit Ayodhya on December 30
x

PM Modi: రేపు అయోధ్యకు ప్రధాని మోడీ.. భారత్‌ - నేపాల్‌ సరిహద్దుల్లో నిఘాను పటిష్ఠం చేసిన భద్రత బలగాలు..

Highlights

PM Modi's Ayodhya Visit Tomorrow: రేపు అయోధ్యలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు.

PM Modi's Ayodhya Visit Tomorrow: రేపు అయోధ్యలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. అయోధ్యలో నిర్మాణం పూర్తి చేసుకున్న అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును, రైల్వేస్టేషన్‌ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 30న విచ్చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో భారత్‌ - నేపాల్‌ సరిహద్దుల్లో నిఘాను పటిష్ఠం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రధాన రహదారుల్లో నిఘా కెమెరాలు, మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటుచేసి.. జాగిలాలతోపాటు ఒక ప్లాటూను మహిళా రక్షకదళాన్ని నియమిస్తున్నట్లు వివరించారు. సరిహద్దులోని ప్రార్థన మందిరాలపై నిఘా ఉంటుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories