Mumbai: అటల్‌ సేతుపై మొదటి ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు

First Accident Mumbai New  Atal Setu
x

Mumbai: అటల్‌ సేతుపై మొదటి ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు

Highlights

Mumbai: డ్యాష్‌కామ్‌లో రికార్డయిన ప్రమాద దృశ్యాలు

Mumbai: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో నూతనంగా నిర్మించిన ‘అటల్‌ సేతు’పై తొలి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు సహా చిన్నారులు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ముంబై నుంచి రాయ్‌గఢ్‌ జిల్లాలోని చిర్లేకు వెళుతున్న ఓ కారు... అటల్‌ సేతుపైకి చేరుకోగానే.. ముందు వెళుతున్న మరో వాహనాన్ని దాటేందుకు యత్నించింది. దీంతో అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు.

ప్రమాదం తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే వాహనం సముద్రంలో పడేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన మొత్తం వంతెనపై వెళుతున్న మరో కారు డ్యాష్‌కామ్‌లో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అటల్‌ సేతు ప్రారంభించిన తర్వాత ఇదే తొలి ప్రమాదమని అధికారులు తెలిపారు. గాయపడిన మహిళలు, చిన్నారులను ముంబై ట్రాఫిక్‌ పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories