Mahesh Babu: 2028 వరకు మహేశ్ బాబు దర్శనం కష్టమేనా?

Mahesh Babu: 2028 వరకు మహేశ్ బాబు దర్శనం కష్టమేనా?
x

Mahesh Babu: 2028 వరకు మహేశ్ బాబు దర్శనం కష్టమేనా?

Highlights

Mahesh Babu: మహేశ్ బాబు గుంటూరు కారం సంక్రాంతికి రాబోతోంది.

Mahesh Babu: మహేశ్ బాబు గుంటూరు కారం సంక్రాంతికి రాబోతోంది. అక్టోబర్ లోగా అంటే దసరా లోగా షూటింగ్ పూర్తయ్యేలా ఫిల్మ్ టీం వేగం పెంచుతోంది. ఐతే మహేశ్ అభిమానులకు ఇప్పుడు రాజమౌళి చేదు వార్త రెడీ చేశాడట. అదే ఫ్యాన్స్ ని కంగారు పెట్టేలా ఉంది.

గుంటూరు కారం అక్టోబర్ లోగా పూర్తైతే, నవంబర్ నుంచి రాజమౌళి మూవీ తాలూకు వర్క్ షాప్ షురూ అవుతుంది. ఆ వర్క్ షాపుతో 6 నెలలు మహేశ్ బాబు సెట్లో బిజీ అవుతాడు. వచ్చే సమ్మర్ ఎండింగ్ నుంచి షూటింగ్ షురూ అన్నారు. కాని అక్కడే బ్రేక్ పడుతోంది. షాక్ తగిలేలా ఉంది. బాహుబలి తాలూకు భయాలు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని డైలామాలోకి నెట్టేలా ఉన్నాయని తెలుస్తోంది.

బాహుబలి రెండు భాగాలుగా వచ్చింది. అచ్చంగా అలానే మహేశ్ బాబు మూవీని రాజమౌళి ప్లాన్ చేశాడట. ఇలా చేస్తాడని మొదట్నుంచి అనుమానాలున్నాయి. కాని కథ కలిసిరావటంతో, రెండు భాగాలు తప్పట్లేదట. బడ్జెట్ కూడా 1500 కోట్లకు పెరగటమే కారణం అంటున్నారు.

బాహుబలి 180 కోట్లతో మొదలు పెట్టి 350 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. కారణం ఒక కథ అనుకున్నది కాస్త రెండు భాగాలుగా ప్లాన్ చేయాల్సి రావటం. అంతా కథ లెంథ్ పెరగటం వల్లే అన్నారు. అలాంటి పరిస్థితే మళ్ళీ మహేశ్ బాబు మూవీకి వచ్చిందట.

మహేశ్ బాబుతో జక్కన్న తీయబోయేది పాన్ వరల్డ్ మూవీ. అందులోనూ 1500 కోట్ల బడ్జెట్ సినిమా. సో పెట్టుబడి రాబడిగా మారాలంటే కమర్శియల్ గా రెండు భాగాల ఐడియానే బెటర్ అంటున్నారు. కథకు కూడా అంత సీన్ ఉండటంతో రెండు బాగాలుగా ప్లాన్ చేస్తున్నారట. అంతా ఓ కే కాని ఒక్క భాగంగా వచ్చిన త్రిబుల్ ఆర్ ని పూర్తి చేసేందుకు రెండేళ్లకు పైనే టైం తీసుకున్న జక్కన్న మహేశ్ తో 2 భాగాలుగా సినిమా తీయాలంటే కనీసం 4 నుంచి ఐదేళ్లు పడుతుంది... సో అప్పటి వరకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ నిరీక్షణ తప్పేలా లేదంటున్నారు. అక్కడే అభిమానులు కంగారుపడే పరిస్థితి వచ్చిందంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories