Bigg Boss 7 Telugu Wild Card: 'రైతు బిడ్డ'కు తోడైన తెలంగాణ 'పాట బిడ్డ'.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు.. పూర్తి వివరాలు మీకోసం..!

Bigg Boss 7 Telugu 2.0 Grand Launch Check Here Wild Card Entry Contestants Full List
x

Bigg Boss 7 Telugu Wild Card: 'రైతు బిడ్డ'కు తోడైన తెలంగాణ 'పాట బిడ్డ'.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు.. పూర్తి వివరాలు మీకోసం..!

Highlights

Bigg Boss 7 Telugu Wild Card: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఒకరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.

Bigg Boss 7 Telugu Wild Card: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఒకరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో కొత్త ట్విస్టులతోపాటు, వినోదం, కంటెస్టెంట్లమధ్య పోటీకి మరింత ఆస్కారం ఉందంటూ హామీ ఇస్తున్నారు. బిగ్ బాస్ 2.0లో కొత్త కంటెస్టెంట్స్ ఎవరు, వారి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అంబటి అర్జున్:

బిగ్ బాస్ హౌస్‌లోకి ముందుగా ఎంట్రీ ఇచ్చింది అంబటి అర్జున్. అసలు పేరు అంబటి నాగార్జున. ఈయనొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అయితే, నటనలో అనుభవం ఉంది. కొన్ని సినిమాల్లోనూ కనిపించాడు. అలాగే, "అగ్నిసాక్షి", "దేవత" వంటి సీరియల్స్‌లో తనదైన ముద్ర వేశాడు. బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత, అతను తన అభిప్రాయాలను వ్యక్తపరచడంలో సమయాన్ని వృథా చేయలేదు. ముఖ్యంగా ప్రశాంత్, ప్రిన్స్‌ల గేమ్‌ప్లేలపై ప్రశంసల వర్షం కురిపించాడు. అదే సమయంలో అమర్, సందీప్‌ల వ్యవహారంపై అసహనం వ్యక్తం చేశాడు.

అశ్విని:

NIT వరంగల్‌కు చెందిన ఈ యువ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నటనపై ఉన్న మక్కువతో అశ్విని బిగ్ బాస్ షోలో చేరాలని నిర్ణయించుకుంది. ఆమె తన ఎంట్రీలోనే తనదైన ముద్ర వేసింది. శివాజీ, ప్రశాంత్‌ల గేమ్‌ప్లేను మెచ్చుకుంటూనే.. ప్రియాంక, శోభలపై విమర్శలు గుప్పించింది. ఈమె ప్రవేశం చాలా మంది హౌస్‌మేట్స్, వీక్షకులను ఆశ్చర్యపరిచింది. కారణం, ఈ షోలో చేరడానికి ముందు ఆమె చాలా మందికి తెలియకపోవడమే.

భోలే షావలి:

తెలంగాణకు చెందిన భోలే షావలి సంగీత దర్శకుడిగా, గాయకుడిగా పేరుగాంచాడు. అతను తనను తాను "పాట బిడ్డ" లేదా "పాటల కొడుకు"గా పరిచయం చేసుకున్నాడు. హోస్ట్ నాగార్జునకు అంకితం చేసిన పాటను కూడా పాడాడు. ఈ క్రమంలో శివాజీ, ప్రశాంత్‌ల గేమ్‌ప్లేను మెచ్చుకున్నాడు. అయితే, అమర్‌ వ్యవహారం బాగోలేదంటూ చెప్పుకొచ్చాడు. కొంతమంది హౌస్‌మేట్స్ అతని పాటల ద్వారా అతన్ని గుర్తించారు. కానీ, భోలే షావలి చాలా మందికి కొత్త ముఖంగా కనిపించింది.

పూజా మూర్తి:

"గుండమ్మ కథ" వంటి షోల ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న పూజా మూర్తి.. తెలుగు టీవీ సీరియల్స్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈమె వాస్తవానికి మొదటి రోజు బిగ్ బాస్ 7 లో చేరాల్సి ఉంది. కానీ, ఆమె తండ్రి ఆకస్మిక మరణం కారణంగా ఆమె ప్రవేశాన్ని ఆలస్యం చేయాల్సి వచ్చింది. తన తండ్రి కోరికలను దృష్టిలో ఉంచుకుని పూజా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించింది. ఆమె శివాజీ, సందీప్‌ల గేమ్‌ప్లేపై ప్రశసంల వర్షం కురిపించింది. అయితే తేజ అంతగా ఆకట్టుకోలేదంటూ చెప్పుకొచ్చింది. STAR MAA నేపథ్యంతో ఉన్న మరో సీరియల్ బ్యాచ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

నాయని పావని:

టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రముఖంగా ఎదిగిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నయని పావని చివరి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఆమె చిన్న-బడ్జెట్ సినిమాలు, షార్ట్ ఫిల్మ్‌లలో కూడా నటించింది. ఆమె రాక బిగ్ బాస్ హౌస్‌లోని వ్యక్తుల కలయికను మరింత పెంచింది.

పాత, కొత్త హౌస్‌మేట్స్ అందరూ సమానమేనని, హక్కులు, అధికారాలను వీరికి కూడా ఉంటాయని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఈ ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో, బిగ్ బాస్ హౌస్‌లోని డైనమిక్స్ మారడం ఖాయం, ఇది అనూహ్యమైన, థ్రిల్లింగ్ సీజన్‌గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories