Bigg Boss 7 Telugu: ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో ఆమె.. యావర్‌కు క్లాస్ పీకిన నాగర్జున.. రీఎంట్రీ ఇచ్చిన దామిని, రతిక, సుబ్బు?

Bigg Boss 7 Telugu: ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో ఆమె.. యావర్‌కు క్లాస్ పీకిన నాగర్జున.. రీఎంట్రీ ఇచ్చిన దామిని, రతిక, సుబ్బు?
x
Highlights

Bigg Boss 7 Telugu: మొత్తానికి ప్రిన్స్ యావర్ బిగ్ బాస్ హౌస్ కెప్టెన్‌గా మారాడు.

Bigg Boss 7 Telugu: మొత్తానికి ప్రిన్స్ యావర్ బిగ్ బాస్ హౌస్ కెప్టెన్‌గా మారాడు. మొదటి వారం నుంచి ప్రయత్నిస్తూ.. చివరికి ఆరో వారంలో సెకండ్ కెప్టెన్ అయ్యాడు. పోటుగాళ్లు, ఆట గాళ్ల మధ్య పెట్టిన టాస్కులలో ఆటగాళ్లే విజేతలుగా నిలిచారు. ఇక చివరగా పెట్టిన బెలూన్ టాస్కులో ప్రిన్స్ యావర్ హౌస్ కెప్టెన్‌గా మారాడు. అయితే, యావర్‌ను కెప్టెన్ చేసేందుకు నయని పావని కీలకపాత్ర పోషించింది. లాస్ట్ మినిట్‌లో క్షణంలో కీ తీసుకువచ్చి యావర్ చేతికి అందించింది. అతను కెప్టెన్ అవ్వడంలో అతని వెన్నంటే ఉంది. ఇక్కడివరకు బాగానే ఉంది.. కానీ యావర్ బిహేవియర్ చేంజ్ అయింది. హౌస్ లో రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో చేయిస్తున్నాడు. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్‌గా ముద్రపడిన వాళ్లకు దమ్కీలు ఇస్తున్నాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో చూస్తే ఇదే తెలుస్తోంది. ఈ క్రమంలో అమర్ దీప్, యావర్ మధ్య గొడవ జరిగింది. వీరిద్దరి మధ్య సందీప్ తలదూర్చి వీరి గొడవను మరింత పెద్దది చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదే విషయాన్ని గుర్తిచేసి మరీ చేశాడంటూ యావర్ క్లాస్ తీసుకున్నాడు.

బిగ్‏బాస్ సీజన్ 7 ఆరోవారం ఎలిమినేషన్ దశకు చేరకుంది. ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తేలనుంది. అయితే, ప్రోమోలో యావర్‌కు హోస్ట్ నాగర్జున క్లాస్ తీసుకున్నాడు. కెప్టెన్ అయ్యాక యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ మారిందంటూ క్లాస్ తీసుకున్నాడు. అలాగే సందీప్‌ను కూడా ఏకిపారేశాడు కాగా, ప్రోమో వీడియోలో సందీప్ అరెయ్ అంటూ పిలిచినట్లు చూడొచ్చు. అయితే, యావర్ ఈ మాటకు అభ్యంతరం చెప్పాడు. ఈ మాటతో యావర్, సందీప్ మధ్య గొడవే జరిగింది.

రీఎంట్రీ ఇచ్చిన ఎలిమినేట్ కంటెస్టెంట్స్?

అయితే, గత వారాల్లో ఎలిమినేట్ అయిన రతిక రోజ్, సింగర్ దామిని, శుభ శ్రీ హౌస్‌లోకి అడుగుపెట్టినట్లు వీడియోలో చూపించారు. కాగా, వీరు అతిథులుగా వచ్చారా?.. లేదా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్‌బాస్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చారా అనేది చూడాలి.

ఎలిమినేషన్ మరోసారి లేడీనే?

బిగ్‌బాస్‌ 7 ఆరోవారం ఎలిమినేషన్‌లో అమరదీప్, ప్రిన్స్ యవర్, తేజ, శోభాశెట్టి, పూజా, అశ్విని, నయని పావని ఇలా ఏడుగురు ఉన్నారు. అయితే, వీళ్లలో నయని పావని ఎలిమినేట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు శోభాశెట్టి, పూజా డేంజర్ జోన్‌లో ఉండగా.. షడన్‌గా నయని పావని చివరి స్థానానికి పడిపోయిందంట.

Show Full Article
Print Article
Next Story
More Stories