సీనియర్‌ చంద్రబాబు శ్రీకాకుళంకి చేసిందేం లేదు: జగన్

సీనియర్‌ చంద్రబాబు శ్రీకాకుళంకి చేసిందేం లేదు: జగన్
x
Highlights

సీనియర్‌నని చెప్పుకునే చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు చేసిందేం లేదని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 311వ రోజు శ్రీకాకుళం జిల్లా...

సీనియర్‌నని చెప్పుకునే చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు చేసిందేం లేదని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 311వ రోజు శ్రీకాకుళం జిల్లా రాజాంలో చంద్రబాబును జగన్ మరోసారి టార్గెట్ చేశారు. రాజకీయ విలువలకు చంద్రబాబు పాతరేశారని చెప్పడానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీతో ఆయన కలిసిపోవడమేనని అన్నారు. ఆ రోజున అవినీతి అనకొండ అయిన సోనియా గాంధీ, ఈ రోజున అందాల కొండ, ఆనందాల కొండ అయిందా? అని ప్రశ్నించారు. ఆరోజున రాష్ట్రాన్ని విడగొట్టిన సోనియా గాంధీని గాడ్సే అన్నారని, ఈరోజున ఆమె దేవత అని అంటున్నారని విమర్శించారు. ఆ రోజున రాహుల్ గాంధీ లాంటి మొద్దబ్బాయి కూడా దేశాన్ని పరిపాలిస్తాడా? అని నాడు చంద్రబాబు ప్రశ్నించారని, మరి, ఈరోజున, రాహుల్ గాంధీ మేధావి అని ఆయన అంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories